ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం జరిగిన హనుమంత సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఊరేగింపులో సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ వేషధారణల్లో పాల్గొన్న చిన్నారులు భరతనాట్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.