రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లె మండలం మట్టి ప్రాథమిక వ్యవసాయ నూతన సహకార సంఘ భవనాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం ప్రారంభించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో నూతన భవనం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజా నాయుడు ఘనంగా సత్కరించారు.