రాయచోటి మండలం మాధవరం గ్రామం వడ్డిపల్లి నుంచి చాకిబండ గ్రామానికి వెళ్లే రహదారి విషయంలో నెలకొన్న భూ సమస్యకు బుధవారం పరిష్కారం లభించింది. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో గ్రామస్థుల ఫిర్యాదు మేరకు, జిల్లా కలెక్టర్, మంత్రి, జేసీ, ఆర్డీవో ఆదేశాల మేరకు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు తహశీల్దార్ నరసింహ కుమార్ తెలిపారు. వందల ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం జరగడంతో గ్రామస్థులు, రైతులు రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.