AP: నకిలీ మద్యం కేసులో మరో నిందితుడిని కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ13 తిరుమలశెట్టి శ్రీనివాస్ను 5 రోజులపాటు కస్టడీకి ఇచ్చింది. నిందితుడి బెయిల్ పిటిషన్లపై నవంబర్ 3న విచారణ జరపనుంది. అలాగే ఈ కేసులో నిందితుల రిమాండ్ను నవంబర్ 6 వరకు పొడగించింది.