హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ కానిస్టేబుల్తో గదిలో రొమాన్స్ చేస్తున్న భర్తను ఓ మహిళ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. కొంత మంది పోలీసులను తోడుగా తీసుకుని వెళ్లి అతడిపై దాడి చేసింది. అయితే సదరు మహిళ భర్త అతడి ప్రియురాలు ఇద్దరు ఒకే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.