AP: ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. రూ.50,000 కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ డేటా సెంటర్తో 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.87,520 కోట్ల పెట్టుబడితో విశాఖలోనే డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. 11వ ఎస్ఐపీబీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురంలో 3 క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి.