AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న తీరం దాటిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా సూచనలు కనిపించడం లేదు. మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 30న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1వ తేదీ నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.