AP: రాష్ట్రంలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగనున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను సమర్పించనున్నారు. సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.