AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉ.10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను 13వ తేదీన ఉ.11 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.