AP: శ్రేయా ఇన్ఫ్రా కంపెనీలపై సీఐడీ చర్యలు ముమ్మరం అయ్యాయి. వందల కోట్ల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కంపెనీ డైరెక్టర్లు, వారి బంధువుల పేరిట ఉన్న స్థిరాస్తులను డిపాజిటర్ల రక్షణ చట్టం కింద అటాచ్ చేసే ప్రక్రియలో భాగంగా సీఐడీ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దాదాపు రూ.206 కోట్ల వరకు మోసం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.