ఏపీలోని కాలేజీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపల్ లాగిన్లో రిజిస్ట్రేషన్, OTA ప్రక్రియ పూర్తిచేసుకోవాలి. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాల్లో వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లతో హాజరుకావాలి. సచివాలయాల్లో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. లేకపోతే విద్యార్థులే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.