ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500లకు పైగా రైస్ మిల్ కౌంటర్లలో ఈ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రూ.52 కే బీపీటీ స్టీమ్ రైస్, రూ.50 కే బీపీటీ బియ్యాన్ని ఒక్కో వ్యక్తికి 10 కేజీల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రజల ఆదరణను బట్టి త్వరలోనే బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె సహా ఇతర నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.