AP: సుప్రీం కోర్టులో ఏపీ లిక్కర్ కేసుపై నేడు (సోమవారం) విచారణ జరిగింది. రెగ్యులర్ బెయిల్ కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కోరారు. దీనిపై వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం మోహిత్ రెడ్డి మధ్యంతర బెయిల్పై ఉన్నారు.