ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం.. ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు (వీడియో)

88చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు గ్రామీణ బ్యాంకులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్, శ్రీపద్మావతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సాగర్ గ్రామీణ బ్యాంక్) ఒకే గొడుగు కింద విలీనమవుతున్నాయి. ఈ విలీన ప్రక్రియలో భాగంగా అక్టోబర్‌ 9న సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోతాయి. ఈ టైంలో ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ లావాదేవీలు కూడా అందుబాటులో ఉండవు.

సంబంధిత పోస్ట్