AP: అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో ఏపీ పనితీరు దేశానికి బెంచ్మార్క్గా నిలవాలని ఆయన అన్నారు. ఒక జిల్లాలో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేస్తామని, వాటికి సంబంధిత కలెక్టర్లనే నోడల్ అధికారులుగా నియమిస్తామని తెలిపారు. ‘సీయింగ్ ఈజ్ బిలీఫ్’ విధానంలో కార్యదర్శులు 3 రోజులు, హెచ్వోడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు ఫీల్డ్లో పర్యటించాలని ఆదేశించారు.