ఆంధ్రప్రదేశ్ టెట్ 2025 పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఈ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ లాగిన్ వివరాలను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.