AP: పల్నాడు జిల్లా అన్నవరం సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది. నరసరావుపేట డిపోకు చెందిన ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు, తృటిలో పెను ప్రమాదం తప్పింది.