AP: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఆరు సీట్లు అందించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ పరువు తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పోలవరం, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటిలో మంత్రి కందుల దుర్గేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలును పక్కన పెడితే మిగితా చోట్ల.. పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుందట. టీడీపీ నేతలతో కలిసి కలిసి పని చేయకపోవడం, నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోందని సమాచారం.