AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటుచేసుకుంది. ఆంజనేయస్వామి బొమ్మ సెంటర్ వద్ద ఒక ఇంట్లోకి దుండగులు ప్రవేశించి ఆధార్ కార్డు చూపించాలని దంపతులను అడిగారు. మ
ీరు ఎవరు? మీకు ఎందుకు చూపించాలి ఆ
ధార్ కార్డు? అని ప్రశ్నించిన దంపతులపై దుండగులు దాడి చేశారు. దాంతో దుండగులు భార్య గొంతు కోసి, భర్తను రాడ్డుతో తలపై కొట్టి పరారయ్యారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.