AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన మరికొన్ని వీడియోలను వైసీపీ విడుదల చేసింది. టీడీపీ నేతలు కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, ఓ వాహనం ధ్వంసం చేసినట్లు వైసీపీ ఆరోపించింది. టీడీపీ నేతలను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. పలువురికి గాయాలవ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.