ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సుమారు యాభై వేల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉపాధి కోసం నివసిస్తున్నారు. ఈ పరిస్థితిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. నాతవరానికి చెందిన ప్రవాసితో మాట్లాడి తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.