AP: అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం ఆక్సిజన్ అందక పసికందు మృతి చెందగా.. చికిత్స పొందుతూ తాజాగా తల్లి తులసి ప్రాణాలు విడిచింది. చిన్నారి మృతి అనంతరం తల్లి తులసి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కేజీహెచ్లో తులసి ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వారం రోజుల వ్యవధిలో తల్లీబిడ్డ చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.