AP:
వైసీపీ అధినేత వైఎస్
జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు చంద్రబాబు వస్తే జాబు... జగనొస్తే చావేనని విమర్శించారు. ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి సవిత మాట్లాడారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు తావే లేదని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల బిడ్డలు సైతం డీఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్లగా పనిచేస్తున్నారని ప్రస్తావించారు.