నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. బాలెన్ షా నాయకత్వంపై నేపాల్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. పరస్పర సహకారం, స్నేహం ద్వారా ఇరు దేశాల ప్రజలకు మేలు జరిగేలా సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. మోదీ అభినందనలకు బాలెన్ షా ధన్యవాదాలు తెలిపి, ఇరు దేశాల ప్రజల మేలు కోసం కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.