బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్, తన దేశం భారత సరిహద్దులో మరో పాకిస్తాన్గా మారుతోందని, పాక్ ఐఎస్ఐ స్వేచ్ఛగా పనిచేస్తోందని ఆరోపించారు. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థి నిరసనల్లో మరణాల సంఖ్యపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. షేక్ హసీనా మాట్లాడుతూ, ఈ నిరసనలను 'అసాంఘిక శక్తులు' హైజాక్ చేసి, అధికారం చేజిక్కించుకోవడానికి ఉపయోగించుకున్నాయని, దీని వెనుక మహమ్మద్ యూనస్ మాస్టర్ మైండ్గా వ్యవహరించారని ఆరోపించారు.