అద్దంకిలో 10వ శతాబ్దం నాటి ఆలయం ఇదే

0చూసినవారు
అద్దంకిలో 10వ శతాబ్దం నాటి ఆలయం ఇదే
అద్దంకి మండలంలోని ధర్మవరంలో ఉన్న ధర్మలింగేశ్వర స్వామి ఆలయ చరిత్రను పురావస్తు పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి వెల్లడించారు. తూర్పు చాళుక్యుల హయాంలో, సుమారు క్రీ.శ. 950 ప్రాంతంలో భజయరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. చెరువును ఆనుకొని కొండపై కొలువుదీరిన ఈ పురాతన ఆలయం బాపట్ల జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, నాటి నిర్మాణ శైలికి ఇది అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు.