శనివారం ఉదయం చీరాల – బాపట్ల జాతీయ రహదారిపై పొగమంచు ప్రభావం, డ్రైవర్కు నిద్రమత్తు కారణంగా లారీ పందిళ్లపల్లి వద్ద రోడ్డు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీకి స్వల్ప నష్టం జరిగింది, అయితే డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.