బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక తీరానికి వచ్చే భక్తులను బాపట్ల రూరల్ పోలీసులు చెక్ పోస్ట్ వద్ద నుండి వెనక్కి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించే వరకు సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో వేలాది మంది భక్తులు సూర్యలంక ప్రాంతానికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు.