బల్లికురవ మండలం గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డ రోడ్డు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న సిమెంట్ లారీ నామ్ రోడ్డుపై అదుపుతప్పి బోల్తా పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. లారీ బోల్తా పడటంతో రహదారిపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.