వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి: కలెక్టర్

279చూసినవారు
వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి: కలెక్టర్
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం విలేకరులకు కీలక సూచనలు చేశారు. స్థానిక కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపంలో జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వార్తలను ప్రచురించాలని కోరారు.