అమెరికాలో అదృశ్యమైన సంతమాగులూరు మండలానికి చెందిన కారసాని హరికృష్ణ రెడ్డి ఆచూకీ నెల రోజులు గడిచినా లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. అమెరికా పోలీసు యంత్రాంగం, భద్రతా విభాగాలు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెలుగులోకి రాలేదని తెలుస్తోంది.