బాపట్ల సూర్యలంక లో గురువారం సముద్ర స్నానాలకు వచ్చిన వరంగల్ చెందిన ఒక కుటుంబం ముగ్గురు తల్లి, తండ్రి, కుమారుని అలల తాకిడికి కొట్టుకుపోతున్న వారినీ గమనించిన విధుల్లో ఉన్న స్విమ్మర్స్ క్షణాల్లో ఈదుకుంటూ వెళ్లి ముగ్గురిని సురక్షితంగా కాపాడి బయటకు తీసుకువచ్చారు. బాపట్ల పంచాయతీ వారు స్విమ్మర్స్ ను ఏర్పాటు చేయటం మంచి ఆలోచన అని సూర్యలంక సముద్ర స్థానాలకు వచ్చిన ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన వరకు మాత్రమే సముద్రంలోకి వెళ్లాలని అధికారులు పర్యాటకులకు సూచించారు.