వేమూరు-తెనాలి రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు సుమారు 40-45 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. ఆచూకీ తెలిసినవారు రేపల్లె రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.