తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఒక బాలుడు ఇంటి నుంచి సైకిల్పై వెళ్లిపోయిన ఘటన వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే వేటపాలెం ఎస్సై బాలుడి వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది గంటల్లోనే బాలుడిని గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, అతని తండ్రిని పిలిపించి సురక్షితంగా అప్పగించారు.