సంతమాగులూరు సీఐ వెంకట్రావు శుక్రవారం ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని, సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారని ఆయన తెలిపారు.