చండీగఢ్ లోని రాయ్పూర్లో శనివారం జరిగిన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో చీరాల యువకుడు దేవరకొండ ప్రేమ సాగర్ 88 కేజీల విభాగంలో 270 కిలోలు ఎత్తి రజత పతకాన్ని సాధించాడు. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్కు తొలి పతకాన్ని అందించిన ఘనతను ప్రేమ సాగర్ సొంతం చేసుకున్నాడు. క్రీడాభిమానులు అతన్ని అభినందిస్తున్నారు.