బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరం ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైలులో ఐదు కోట్ల రూపాయలతో ఒక దొంగ పరారయ్యాడన్న సమాచారంతో, పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని వద్ద భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి, నగదు ఎలా సంపాదించాడు, ఎవరి కోసం తరలిస్తున్నాడు అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.