పర్చూరు మండలం నూతలపాడు గ్రామ తాగునీటి అవసరాల కోసం బుధవారం సాగర్ జలాలను విడుదల చేశారు. గ్రామ చెరువులు నిండేలా కాలువల ద్వారా నీటిని తరలించేందుకు పూడికతీత పనులు చేపట్టి, చెత్తాచెదారాన్ని తొలగించారు. పీఎసీఎస్ చైర్మన్ విన్నకోట సతీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పనుల అనంతరం, సాగర్ నీటి రాకతో తాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు.