ఐడీపీఎస్ లో ఎన్సీసీ యూనిట్ ప్రారంభం

967చూసినవారు
చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సోమవారం జాతీయ క్యాడేట్ దళం (ఎన్ సి సి) యూనిట్ ను ఘనంగా ప్రారంభించారు. కల్నల్ ఉదయ్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ ఈ యూనిట్ ను అధికారికంగా ప్రకటించారు. దేశ సేవ వంటి విలువలు ఎన్సిసి ద్వారా విద్యార్థులలో బలపడతాయని ప్రిన్సిపల్ సుభాష్ చంద్రబోస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివప్రసాద్ తెలిపారు.
Job Suitcase

Jobs near you