కొల్లూరులో మంగళవారం గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపు వేచి చూడాలని ప్రశ్నించిన రైతులకు, ఒక్కొక్కరికి ఒక్క యూరియా కట్ట ఇస్తామని అధికారులు చెప్పడంతో వారు నిరాశ చెందారు. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు కోరారు.