సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP), చక్రవడ్డీ పద్ధతి ద్వారా నెలకు కేవలం రూ.5,000 పెట్టుబడితో 15 ఏళ్లలో రూ.1.5 కోట్లు సంపాదించవచ్చని బిజినెస్ కోచ్ దీపక్ వాధ్వా సూచించారు. ప్రతి సంవత్సరం పెట్టుబడిని 20% పెంచుకుంటూ, ఆ తర్వాత సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా నెలనెలా రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. దీనికి 15 ఏళ్ల ఓర్పు, క్రమశిక్షణ అవసరమని, మ్యూచువల్ ఫండ్స్లో 12-15% రాబడితో ఇది సాధ్యమవుతుందని తెలిపారు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించాలని సూచించారు.