ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు అభిమానులను ఆకట్టుకోవడానికి ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ఉచిత ఐపీఎల్ టికెట్లు అంటూ ఒక లింక్ను షేర్ చేశారు. అభిమానులు ఆ లింక్ను క్లిక్ చేయగా, అది ఏప్రిల్ ఫూల్ అని, ఆటపట్టించామని స్క్రీన్ పై కనిపించింది. అపరిచిత లింకుల ద్వారా జరిగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో అభిమానులు ఆగ్రహించినా, తర్వాత పోలీసులు చేసిన మంచి పనిని గుర్తించి అభినందిస్తున్నారు.