AP: మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత సోమవారం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.