AP: చంద్రబాబు హయాంలోనే భోలే బాబా డెయిరీ వచ్చిందని, ఆ తర్వాత అది హర్ష డెయిరీగా మారిందని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, కేవలం వైసీపీపై దాడి కోసమే ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఆరోపణలు నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు.