AP: ఆదివారం రాష్ట్రంలోని 35 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 87 మండలాల్లో కొంతమేర వడగాల్పులు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, NTR జిల్లాల్లోని పలు మండలాలు అత్యంత ప్రభావితమయ్యే అవకాశముందంది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాలో ఉష్ణోగ్రతలు 40°C–42°C మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కాగా, శనివారం మార్కాపురం(D) బొట్లగూడులో అత్యధికంగా 42.6°C ఉష్ణోగ్రత నమోదు అయినట్టు తెలిపింది.