AP: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించింది. పెండింగ్ బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. నిధుల లభ్యతను బట్టి విడతలవారీగా చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యావుల చర్యలు చేపడుతున్నారు. దీంతో ఉద్యోగులు భారీ ఊరట పొందనున్నారు.