AP: మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను నొప్పికి చికిత్స చేయించుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల అస్వస్థతకు గురైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు.