AP: మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ రిపోర్టులను ఆధారంగా తీసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎవరు ఎంత భూమిని ఆక్రమించారో వివరాలు సేకరించి ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలని పవన్ తెలిపారు.