AP: తిరుమలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ హెచ్చరించారు. కొందరు తిరుమల క్షేత్రంపై నిందలు వేస్తున్నారని, శ్రీ వెంకటేశ్వర స్వామితో వెటకారం చేస్తూ అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రహ్మోత్సవాల ముందు అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం ఉందని, తిరుపతి ప్రశాంతతను భగ్నం కలిగించేలా సీక్రెట్ అజెండా ఉన్నట్లు ఉందని పేర్కొన్నారు.