AP: నెల్లూరు (D), ఇందుకూరుపేట (M), మైపాడు పాలెంలో విషాద ఘటన జరిగింది. ఆదిశేషయ్య (45) మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లాడు. వేట సమయంలో ప్రమాదవశత్తు పడవ బోల్తా పడడంతో ఆదిశేషయ్య నీటిలో పడిపోయాడు. గమనించిన తోటి వారు కాపాడి ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.